బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
తెలంగాణ

ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్

ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్

ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వివిధ నేరాలకు సంబంధించి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, కేవలం రెండు రోజుల్లో ఐదు కేసులను ఛేదించారు. కేసులకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన సొత్తు, మోసం ద్వారా తీసుకున్న నగదు మరియు బంగారాన్ని రికవరీ చేశారు.1. మోసం కేసులో నిందితుడి అరెస్ట్ – రూ.9 లక్షల నగదు, 3.5 తులాల బంగారం మోసంమోసం మరియు ఐటీ యాక్ట్‌కు సంబంధించిన కేసులో ఫిర్యాదు అందడంతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు కామినెడ్డి శివమోహన్ రెడ్డి, అక్కపల్లి గ్రామం, మార్కాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.దర్యాప్తులో నిందితుడు గతంలో సుమారు 12 సంవత్సరాల పాటు **SSB (Sashastra Seema Bal)**లో కానిస్టేబుల్‌గా పనిచేసినట్లు, అనంతరం విధి నిర్వహణలో అనుచిత ప్రవర్తనతో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడటంతో సర్వీసు నుండి తొలగించబడినట్లు గుర్తించారు.సర్వీసు నుండి తొలగించబడిన అనంతరం ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి, వివిధ వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుని వారి నమ్మకాన్ని సంపాదించి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతంలో కూడా ఇలాంటి మోసం కేసుల్లో జైలుకు వెళ్లినట్లు గుర్తించారు.ప్రస్తుత కేసులో బాధితురాలితో ఫోన్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని, కొంతకాలం పాటు సన్నిహితంగా ఉంటూ ఆమె నమ్మకాన్ని సంపాదించాడు. అనంతరం తనకు, తన కుటుంబ సభ్యులకు వివిధ అవసరాలు ఉన్నాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తదితర కారణాలు చెబుతూ బాధితురాలిని నమ్మించి, వివిధ సందర్భాల్లో సుమారు రూ.9,00,000/- నగదు తీసుకుని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.అదేవిధంగా సుమారు 3.5 తులాల బంగారం కూడా తీసుకుని, దానిని కంభం కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు గుర్తించారు.నిందితుడిపై గతంలో కూడా మార్కాపురం, గిద్దలూరు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లలో ఇలాంటి మోసాలకు సంబంధించి కేసులు నమోదైనట్లు గుర్తించారు.నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.1. అస్బెస్టాస్ కాలనీలో వరుస ఇళ్ల దొంగతనాలు – నిందితుడి అరెస్ట్, చోరీ సొత్తు రికవరీజగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీలో గత 15 రోజులుగా రాత్రి వేళల్లో వరుస ఇళ్ల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో నిందితుడు గరికపాటి వెంకటేష్గా గుర్తించి అరెస్ట్ చేశారు.నిందితుడు మొత్తం మూడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒక ఇంట్లో మొబైల్ ఫోన్, మరో ఇంట్లో వెండి వస్తువులు, మరో ఇంట్లో 3 గ్రాముల బంగారం మరియు రూ.60,000/- నగదు చోరీ చేసినట్లు గుర్తించారు.నిందితుడి వద్ద నుండి మొబైల్ ఫోన్ మరియు 3 గ్రాముల బంగారం విజయవంతంగా రికవరీ చేశారు.నిందితుడిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.1. రూ.10 లక్షల విలువైన నాలుగు బ్యాటరీల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ – బ్యాటరీలు రికవరీజగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని EV ఛార్జింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న తోట గురువప్ప ఆగస్టు 15వ తేదీన నాలుగు బ్యాటరీలను చోరీ చేసినట్లు ఫిర్యాదు అందింది.ఛార్జింగ్ స్టేషన్ సూపర్‌వైజర్ మహేష్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో నిందితుడు చోరీ చేసిన బ్యాటరీలను స్క్రాప్ షాపులో విక్రయించి, వచ్చిన డబ్బుతో తన స్వస్థలమైన గిద్దలూరుకు వెళ్లిపోయినట్లు గుర్తించారు.ఒక్కో బ్యాటరీ విలువ సుమారు రూ.2.50 లక్షలు కాగా, నాలుగు బ్యాటరీల మొత్తం విలువ సుమారు రూ.10 లక్షలు.నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని గిద్దలూరుకు పంపించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి చోరీకి గురైన నాలుగు బ్యాటరీలను విజయవంతంగా రికవరీ చేశారు.నిందితుడిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.పోలీసుల ప్రత్యేక దృష్టినేరాల నియంత్రణ, కేసుల త్వరితగతిన ఛేదనకు జగద్గిరిగుట్ట పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు, సమన్వయంతో దర్యాప్తు చేపట్టి కేవలం రెండు రోజుల్లో ఐదు కేసులను ఛేదించి, నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన విలువైన సొత్తును రికవరీ చేశారు.ఈ కేసులను డీసీపీ కుత్బుల్లాపూర్ కోటి రెడ్డి, ఆదేశాల మేరకు, ఏసీపీ కుత్బుల్లాపూర్ బాలగంగి రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా ఛేదించారు.కేసుల ఛేదనలో ఇన్‌స్పెక్టర్ సురేష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర రెడ్డి, ఏఎస్సై రామ్ కుమార్, పీసీలు నరేష్ గౌడ్, రమేష్ మరియు డబ్ల్యూపీసీ సుమ విశేష కృషి చేశారు.వారి సమర్థవంతమైన దర్యాప్తు, కృషి మరియు విధి నిర్వహణలో చూపిన ప్రతిభను ఉన్నతాధికారులు అభినందించి, తగిన రివార్డుతో సత్కరించారు.

క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]