*రామకోటి రామరాజు ఆధ్యాత్మిక సేవలు అమోఘం**● శ్రావణంలో 10కోట్ల శ్రీరామ లిఖిత యజ్ఞానికి శ్రీకారం**● గజ్వేల్ ఏసీపీ నర్సింలు*శ్రావణమాసంలో లోక కల్యానార్తం 10 కోట్ల శ్రీరామ నామ లిఖిత మహా సంకల్పం చేపట్టడం ఒక మహాత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ శ్రీకారం చుట్టడం అభినందనీయం అని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు అన్నారు. గురువారం నాడు భద్రాచలం నుండి వచ్చిన నూతన రామకోటి పుస్తకాలను ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ శ్రావణమాసంలో 10 కోట్ల శ్రీరామ నామాన్ని లిఖించి భద్రాచల రామయ్యకు సమర్పించాలనే గొప్ప సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. రామకోటి రామరాజు రామభక్తి, ఆధ్యాత్మిక సేవా తపన ఎంతో గొప్పదన్నారు. గత మూడు దశాబ్దాలుగా భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ శ్రీరామ నామాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల కార్యక్రమం నిర్వహణ ఓ అద్భుతం ఘట్టం అన్నారు. రామనామం ఉన్న చోట భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట లోకకల్యాణం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక సమరత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, రిమ్మనగూడ సర్పంచ్ కర్ణాకర్, వెంకట నర్సింహారావు, పాశికంటి శ్రీనివాస్, గుండు మల్లేశం పాల్గొన్నారు.
రామకోటి రామరాజు ఆధ్యాత్మిక సేవలు అమోఘం**● శ్రావణంలో 10కోట్ల శ్రీరామ లిఖిత యజ్ఞానికి శ్రీకారం**
