ప్రతిపక్షాల సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన డివైన్ యాక్ట్ – క్లీన్ ఇంపాక్ట్’ కార్యక్రమాన్ని అభినందించారు.పూజలు, పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం వినియోగంలో లేని దేవుళ్ల చిత్రపటాలు, పాత ఫొటో ఫ్రేములు, విగ్రహాలు, క్యాలెండర్లు, పూజా సామగ్రిని రోడ్లపై, చెత్తకుప్పల్లో, కాలువలు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో పడేయకుండా గౌరవప్రదంగా సేకరించి పర్యావరణహితంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముందు చూపుతో ‘డివైన్ యాక్ట్ – క్లీన్ ఇంపాక్ట్’ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తి భావాలకు భంగం కలగకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో వాటిని నిర్వహించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి నెల నాలుగో శనివారం ‘డివైన్ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్’ కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ సర్కిల్ వివేకానంద నగర్ డివిజన్ లోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాన్ని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ఐఏఎస్, ఆల్విన్ కాలనీ కమీషనర్ డీసీ చాముండేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సృజన మాట్లాడుతూ.. పూజల అనంతరం వినియోగంలో లేని దేవతా చిత్రాలు, విగ్రహాలు, పూజా సామగ్రిని ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి పాత పూజా సామగ్రిని ప్రత్యేక సేకరణ కేంద్రాలకు అందించాలని సూచించారు. ఆధ్యాత్మిక విశ్వాసాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన డివైన్ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయినేని చంద్రకాంతరావు, సంజీవరెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు, పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాల సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన డివైన్ యాక్ట్ – క్లీన్ ఇంపాక్ట్’ కార్యక్రమాన్ని అభినందించారు.
