ఢిల్లీ టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో తెలంగాణ విద్యార్థి ప్రభాస్ రాజ్కు కాంస్య పతకంసూ, హైదరాబాద్:ఢిల్లీలోని టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 20వ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కప్ కరాటే ఛాంపియన్షిప్–2026లో తెలంగాణకు చెందిన విద్యార్థి గడ్డం ప్రభాస్ రాజ్ సత్తా చాటారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్ఠాత్మక కరాటే పోటీల్లో ప్రభాస్ రాజ్ ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం (బ్రాంజ్ మెడల్) సాధించారు. కఠినమైన పోటీల్లో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటూ ప్రభాస్ రాజ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. తన క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణకు గుర్తింపు తీసుకురావడం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ప్రభాస్ రాజ్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి కరాటేపై తనకు ఎంతో ఆసక్తి ఉందని తెలిపారు. ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లిదండ్రులు, కోచ్లు నరేష్, వెంకటేష్ లు అందించిన ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందన్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేయడం, కోచ్లు ఇచ్చిన సూచనలను పాటించడం వల్లే జాతీయ స్థాయి పోటీల్లో రాణించగలిగానని చెప్పారు. తాను సాధించిన కాంస్య పతకం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలనే స్ఫూర్తిని ఇచ్చిందని ప్రభాస్ రాజ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత కష్టపడి సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని పతకం సాధించడం గర్వంగా ఉందని, తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రభాస్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో తెలంగాణ విద్యార్థి ప్రభాస్ రాజ్కు కాంస్య పతకం
