హైదర్నగర్:కీర్తిశేషులు ఆనంద్ కుమార్ పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆనంద్ కుమార్ మిత్ర మండలి ఆధ్వర్యంలో హైదర్నగర్లో అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 1,000 మందికి అన్నదానం చేశారు. అనంతరం ఆనంద్ కుమార్ పాటిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి మిత్రులు, కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు.ఆనంద్ కుమార్తో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధురమైన స్నేహ జ్ఞాపకాలను మిత్రులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన భౌతికంగా తమ మధ్య లేకపోయినా, తమ హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.ఆనంద్ కుమార్ సేవాభావం, స్నేహశీలతను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థం అన్నసమారాధన నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందని మిత్ర మండలి సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్ మిత్ర మండలి సభ్యులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కీర్తిశేషులు ఆనంద్ కుమార్ పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆనంద్ కుమార్ మిత్ర మండలి ఆధ్వర్యంలో హైదర్నగర్లో అన్నదానం
