హైటెక్ సిటీ–జేఎన్టీయూ ప్రధాన రహదారికి మరమ్మతులు.. ఎస్ ఐ టీవీ రావు సైబరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ కూకట్పల్లి జోన్ మాదాపూర్ సర్కిల్ పరిధిలో హైటెక్ సిటీ–జేఎన్టీయూ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న ప్రాంతాలకు మరమ్మతు పనులు చేపట్టారు. కూకట్పల్లి, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, మాదాపూర్, కోకాపేట, నార్సింగి తదితర ప్రాంతాలను అనుసంధానించే ఈ ప్రధాన మార్గంలో నిత్యం భారీగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ఈ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ తరచూ తీవ్రంగా ఉండటంతో రహదారి పరిస్థితి వాహనదారులకు అదనపు ఇబ్బందులు కలిగిస్తోంది. హైటెక్ సిటీ–కూకట్పల్లి మార్గం నగరంలోని కీలక రవాణా కారిడార్లలో ఒకటిగా ఉంది.ఇటీవల రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, వర్షాల కారణంగా మరింత దెబ్బతిన్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లతో పాటు ప్రజా రవాణా వాహనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రద్దీ సమయంలో గుంతల వద్ద వాహనాలు నెమ్మదించడంతో ట్రాఫిక్ ప్రవాహంపై కూడా ప్రభావం పడుతోంది. స్థానిక మాదాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రజలు పడుతున్న ఈ సమస్యను గుర్తించిన మాదాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ టీవీ రావు మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసి రహదారి మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా రహదారిపై ఏర్పడిన గుంతల్లో తారు మిశ్రమాన్ని నింపుతూ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
హైటెక్ సిటీ–జేఎన్టీయూ ప్రధాన రహదారికి మరమ్మతులు.. ఎస్ ఐ టీవీ రావు సైబరాబాద్,
