, జూదం స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి: 22 మంది అరెస్ట్, రూ. 35 లక్షల విలువైన ఆస్తి, నగదు స్వాధార్యంఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం వెనుక భాగంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాలు, జూదం స్థావరంపై శంషాబాద్ జోన్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్, ఆదిబట్ల పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో పందెం రాయుళ్లను, పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే.. నిర్వాహకులు ఒక పాత పౌల్ట్రీ ఫారమ్ను వేదికగా చేసుకొని, ప్రత్యేకంగా పందెం కోళ్లను పెంచుతూ కోడిపందాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుండి పందెం రాయుళ్లను ఆహ్వానించి, వారికి భోజన వసతి కల్పించి ఈ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పందాలు, పేకాట (జూదం) నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు, స్థల యజమాని పరారీలో ఉన్నారు.స్వాధీనం చేసుకున్న సొత్తు (మొత్తం విలువ సుమారు రూ. 35,00,000/-):నగదు: రూ. 3,60,510/-పందెం కోళ్లు: 31 (విలువ సుమారు రూ. 9,30,000/-)కోడి కత్తులు: 146స్మార్ట్ఫోన్లు: 20స్కార్ నోట్బుక్: 01కార్లు (3): ఎర్టిగా (AP29 LH 9523), MG (TS 07 AB 5778), ఆడి (TS 07 FY 2399)ద్విచక్ర వాహనాలు (3): TG 07 G 4528, TS 08 CU 4514, TS 07 EM 0342అదుపులోకి తీసుకున్న నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ (SHO)కు అప్పగించారు.ప్రజలకు విజ్ఞప్తి:కోడిపందాలు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయి. మీ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించగలరు. సమాచారం అందించిన వారి వివరాలు గుప్తంగా ఉంచబడతాయి.ఈ దాడిని శంషాబాద్ జోన్ ఇన్స్పెక్టర్ డి. కృష్ణమోహన్, ఎస్ఐలు కె. మన్సూర్ అలీ, ఎన్. నరసింగరావు మరియు శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ సిబ్బంది, ఆదిబట్ల పోలీసులతో కలిసి నిర్వహించారు.(కె. ఎస్. రావు)అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్,కమిషనర్స్ టాస్క్ఫోర్స్,రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్,హైదరాబాద్ సిటీ.
